శతక
సౌరభాలు  - 2
                             ధూర్జటి  శ్రీ కాళహస్తీశ్వర
శతకము  - 3
           రాజై దుష్కృతి చెందె చందురుడు , రారాజై
కుబేరుండు దృ
           గ్రాజీవంబున గాంచె దు:ఖము , కురుక్ష్మాపాలుడా మాటనే
           యాజిం గూలె సమస్త రాజబంధువులతో ,నా
రాజ శబ్దంబు ఛీ
           ఛీ జన్మాంతరమందు నొల్లను జుమీ ! శ్రీ కాళహస్తీశ్వరా !
                ఈశ్వరా !రాజైన చంద్రుడు కళంకితుడైనాడు .రారాజైన
కుబేరుడు ధనాధిపతి అయ్యు , కుడి నేత్రమును కోల్పోయి , పింగాక్షుడు గా
మిగిలిపోయాడు. ( పార్వతీదేవి హరుని  
అర్ధాంగి యై ఆయన తొడపై అందంగా కూర్చొని ఉండటాన్ని చూచిన కుబేరుడు ఆమె
అదృష్టానికి  ఈర్ష్యాళువై , అసూయ తో  ఆమెను కుడి కంటి తో చూశాడట. అందువలన  కుబేరుని కుడికన్ను నీరుకారి పోయి , అనంతర కాలం
లో పింగాక్షుడైనాడని పురాణ గాథ ) . 
రాజరాజు గా పేరొందిన దుర్యోధనుడు 
,చివరకు యుద్ధము లో  సమస్త బంధు
మిత్రులతో కలసి  నేలకూలాడు . అందువలన ఓ
శంకరా .ఈ రాజ శబ్దమును  నేను జన్మాంతరమందు
నైనను అంగీకరించను  సుమా !
        రాజర్ధాతురుడైనచో నెచట  ధర్మంబుండు  ? నే రీతి నా
        నాజాతి క్రియలేర్పడున్ ? సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు  ? రూ
        పాజీవాళి కి నేది దిక్కు ? ధృతి నీభక్తుల్ భవత్పాద నీ
        రేజంబుల్ భజియింతురే తెరగునన్ ? శ్రీ కాళహస్తీశ్వరా !
                శ్రీ కాళహస్తీశ్వరా  ! రాజు ధనదాహం గలవాడైనచో ఇంకా రాజ్యం లో ధర్మం ఎలా  నిలబడుతుంది . ఏ విధంగా వర్ణాశ్రమ ధర్మాలు  కొనసాగుతాయి . గౌరవ మర్యాదలతో జీవించే వారు ఏ
విధంగా  సుఖంగా ఉండగలరు .  వార కాంతలకు  
ఎవరు ఆధారమౌతారు . ధైర్యం తో నీ భక్తులు 
ఏ విధంగా నిన్న్ను సేవించగలుగుతారు ప్రభూ !
                 తరగల్ పిప్పలపత్రముల్
మెఱుగుటద్దంబుల్ మరుద్దీపముల్
                 కరికర్ణాంతము లెండమావులతతుల్
ఖద్యోత కీటప్రభల్
                 సురవీధీ లిఖితాక్షరంబు
లసువుల్  జ్యోత్స్నా పయ:పిండముల్
             
   సిరులందేల మదాంధు లౌదురొ జనుల్
; శ్రీ కాళహస్తీశ్వరా !
                             ఈశ్వరా  !  ఈ ప్రాణాలు  నీటి కెరటాలు , రావి ఆకులు ,  మెరిసే అద్దాలు , గాలిలో పెట్టిన దీపాలు ,
ఏనుగు చెవుల చివరి వలే  చంచలాలు  , ఎండమావుల సమూహాలు , మిణుగురు పురుగు కాంతులు
, ఆకాశం లో వ్రాసిన వ్రాతలు , వెన్నెల లోని 
పాల కాంతిను ప్రోగు చేసినట్లు అశాశ్వతాలు. 
కాని ఈ జనులు ఈ విషయాన్ని లెక్కచేయక సిరి సంపదలచే మదాంధులై ప్రవర్తించుచున్నారు
.   ఎంత ఆశ్చర్యము !
           నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ ,
నీకన్న నాకెన్న లే
           రన్నల్దమ్ములు , తల్లిదండ్రులు  గురుండాపత్సహాయుండు , నా
           యన్నా  యెన్నడు నన్ను సంసృతి విషాదాంబోధి  దాటించి య
           చ్ఛిన్నానంద సుఖాబ్ది దేల్చెదొ కదే ! శ్రీ కాళహస్తీశ్వరా !  
                             శంకరా ! నేను నిన్ను నమ్మినట్లు గా
ఇతరులను ఎవ్వరినీ నమ్మను . నీకన్న నాకు తల్లిదండ్రులు , అన్నదమ్ములు , గురుడు ,
స్నేహితుడు  అనే వారు ఎవ్వరూ లేరు .  ఓ స్వామీ  ! నన్ను ఈ సంసార మనే దుఖ
సముద్రాన్ని  దాటించి  శాశ్వతానందమయమైన సుఖ సముద్రము లో నన్ను  ఎన్నడు ఓలలాడిస్తావో కదా స్వామీ !
          నీ పంచబడి యుండగా గలిగిన న్భిక్షాన్నమే
చాలు ని
          క్షేపం బబ్బిన రాజకీటకముల నే సేవింపగా
నోప ,నా
          శాపాశంబుల జుట్టి త్రిప్పకుము
సంసారార్ధమై ,బంటు గా
          చేపట్టం దయగల్గెనేని మదిలో  శ్రీ కాళహస్తీశ్వరా !
               ఈశ్వరా  !  నామీద దయచూపి 
నన్ను నీ సేవకుడి గా  స్వీకరించు .
నీ పంచ లో చోటు దొరికితే నాకు భిక్షాన్నమైనా చాలు . నిధి నిక్షేపాలిచ్చినా  హీనులైన రాజులను సేవించలేను .  సంసారం కొఱకు ఆశాపాశాలతో నన్ను త్రిప్పక  నీ బంటు గా 
నన్ను స్వీకరింపుము .
         నీ పేరున్ భవదంఘ్రి తీర్ధము భవ
న్నిష్ట్యూత తాంబూలమున్
         నీ పళ్లెంబు ప్రసాదమున్ గొని కదా  నే బిడ్డడైన వాడ న
         న్నీ పాటిం కరుణింపు మోప నిక నే
నెవ్వారికిం బిడ్డగాన్
         చేపట్టందగు పట్టి మానదగదో ? శ్రీ కాళహస్తీశ్వరా !
                 పరమేశ్వరా  ! నీ
పేరును స్మరిస్తూ , నీ పాదోదకమును స్వీకరిస్తూ , నీచే ఎంగిలి చేయబడిన  నీ పళ్ళెం లోని ప్రసాదాన్ని , తాంబూలాన్ని
స్వీకరిస్తూ నేను నీ బిడ్డగానే పెరిగాను నేను ఇంకా ఎవ్వరికీ బిడ్డగా ఉండలేను
.  చేపట్టి  తిరిగి వదిలివేయడం ధర్మం కాదు .  నన్ను నీ బిడ్డగా దగ్గరకు తీసుకోవలసింది స్వామీ
!
         అమ్మా ! యయ్య యటంచు నెవ్వరిని నేనన్న న్శివా నిన్ను
         సుమ్మీ!   నీ మది తల్లి దండ్రులటంచు
న్జూడగా బోకు నా
         కిమ్మైఁ  దల్లియుఁ దండ్రియున్ గురుడు నీవే కాగ సంసారపుం
         జిమ్మంజీకటి గప్పకుండ గనుమా ! శ్రీ కాళహస్తీశ్వరా !
                   ఓ శివా  ! నేను అమ్మా , అయ్య అని ఎవరినైనా పిలిచినను అది నిన్నే సుమీ . నీవు కాక
నాకు తల్లి దండ్రులెవరున్నారు . నాకు తల్లి  ,తండ్రి , గురువు నీవే కాబట్టి  నన్ను ఈ సంసారమనే  కారు చీకటి కమ్మకుండా నీవే కాపాడవలసింది  స్వామీ !
         కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై
         కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ ,
వారిచే నే గతుల్
         వడసెన్ ? పుత్రులు లేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
         చెడునే మోక్షపదం బపుత్రకునకున్ ? శ్రీ కాళహస్తీశ్వరా !
                 ఓ శంకరా !.ఈ లోకంలో కొందరు అవివేకులు బ్రతుకు మీద
ఆశతో కొడుకులు పుట్టలేదని  విచారిస్తుంటారు
. దృతరాష్ట్రునకు వందమంది కొడుకులు పుట్టలేదా 
?  వారి వలన
అతనికి ఎటువంటి సద్గతులు కల్గినవి ?  పుత్రులు లేని శుకమహర్షి కి ఏ దుర్గతులు
కల్గినవి ? కావున పుత్రులు లేని వారికి మోక్షము లభంచదనుట
అవివేకము కదా !
          గ్రహదోషంబులు  దుర్నిమిత్తములు నీ
కళ్యాణ నామంబు ప్ర
          త్యహమున్ బేర్కొను  నుత్తమోత్తముల బాధంబెట్టగ నోపునే
          దహనుం గప్పగజాలునే శలభ సంతానంబు
;  నీ సేవ చే
          సి హతక్లేశులు గారు గాక మనుజుల్
; శ్రీ కాళహస్తీశ్వరా !
                           శ్రీ
కాళహస్తీశ్వరా !  గ్రహదోషము
వలన కలిగెడి దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామమును ఎల్లప్పుడు జపించెడి  ఉత్తములైన నీ 
భక్తబృందమును  బాధపెట్టలేవు కదా .
ఎట్లనగా ముడతల గుంపు  అగ్ని హోత్రుని
ఆర్పలేవుకదా . అదే విధంగా నిను సేవించెడి మానవులను కష్టములు దరి చేరవు కదా  ప్రభూ !
                                   శ్రీ
కాళహస్తి లో నిర్వహించే రాహు కేతు పూజలకు ఈ విశ్వాసమే ప్రేరణ యై ఉండవచ్చు.
     
అడుగం బోనిక నన్యమార్గ రతులం 
బ్రాణావనోత్సాహినై ,
     
యడుగంబోయిన బోదు నీదు పద పద్మారాధక శ్రేణియు
     
న్నెడకు నిన్ను భజింపగా గనియు 
నాకేలా పరాపేక్ష కో
     
రెడి దింకేమి భవత్ర్పసాదమె తగున్ !
శ్రీ కాళహస్తీశ్వరా !  
( 30 )
                                శ్రీకాళహస్తీశ్వరా !  .ప్రభూ  !  నేను 
ప్రాణ రక్షణ కోసం నిన్ను కాకుండా ఇతరులను సేవించువారిని  యాచించను . 
అంతగా యాచించవలసివచ్చిన నీ భక్తులను మాత్రమే అర్థించెదను .  అయినా నిన్ను సేవించెడి నాకు ఇతర
వాంఛలు ఏముంటాయి ?. నీ అనుగ్రహ ప్రసాదం తప్పితే నాకు
ఇంకేమి  అక్కరలేదు స్వామీ !
                                     .చదువు తూ .. ఉండండి .  మరికొన్ని అందిస్తాను.
*********************************************************************************

